జిల్లాల విభజనతో జగన్ రెడ్డి ప్రభుత్వం కొత్త కుట్ర: దేవతోటి నాగరాజు
ABN , First Publish Date - 2022-04-06T15:54:22+05:30 IST
జిల్లాల విభజనతో జగన్ రెడ్డి ప్రభుత్వం కొత్త కుట్రకు తెరలేపిందని టీడీపీ నేత దేవతోటి నాగరాజు విమర్శించారు.
అమరావతి: రాష్ట్రంలో జిల్లాల విభజనతో జగన్ రెడ్డి ప్రభుత్వం కొత్త కుట్రకు తెరలేపిందని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి దేవతోటి నాగరాజు విమర్శించారు. బుధవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ కొత్త జిల్లాలు, వాటిలోని సహజ సంపదను బూచిగా చూపి ప్రభుత్వం మరింత అప్పు తెస్తుందేమోనని అనుమానం వ్యక్తం చేశారు. జగన్ రెడ్డి కుయుక్తులను కేంద్ర ప్రభుత్వం అడ్డుకోవాలన్నారు. జిల్లాల విభజన భౌగోళికంగా తలా తోకా లేకుండా చేశారని, ఏ ప్రాతిపదికన జిల్లాల విభజన చేపట్టారో వైసీపీ ప్రభుత్వం ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. వైసీపీ ప్రభుత్వ చర్యలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మరో శ్రీలంకను చేసేలా ఉన్నాయని, జగన్ రెడ్డి దుర్మార్గపు చర్యలను కేంద్ర ప్రభుత్వం అడ్డుకోవాలని దేవతోటి నాగరాజు కోరారు.