వైసీపీ ప్రభుత్వం మహిళల్ని అణచివేస్తుంది: దేవతోటి

ABN , First Publish Date - 2022-03-08T15:34:16+05:30 IST

వైసీపీ ప్రభుత్వం మహిళల్ని అణచివేస్తూ పాతకాలపు కట్టుబాట్లతో సంకెళ్లు వేస్తోందని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి దేవతోటి నాగరాజు మండిపడ్డారు.

వైసీపీ ప్రభుత్వం మహిళల్ని అణచివేస్తుంది: దేవతోటి

అమరావతి: వైసీపీ ప్రభుత్వం మహిళల్ని అణచివేస్తూ పాతకాలపు కట్టుబాట్లతో సంకెళ్లు వేస్తోందని  టీడీపీ రాష్ట్ర కార్యదర్శి దేవతోటి నాగరాజు మండిపడ్డారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. భూమి నుంచి అంతరిక్షం వరకూ అన్ని రంగాల్లోనూ మహిళలు రాకెట్ వేగంతో దూసుకు పోతున్నారన్నారు. మహిళలందరికీ ప్రపంచ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. మహిళా లేకపోతే సృష్టిలో జీవం లేదు.. అసలు సృష్టే ఉండదని చెప్పారు. అలాంటి మహిళలకి ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న హత్యలు, అత్యాచారాలపై ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి స్పందన ఏది..? అని ప్రశ్నించారు. చంద్రబాబు  మహిళల అభివృద్ధి కోసం డ్వాక్రా గ్రూపులు వంటి వినూత్న పథకాలు చేపట్టారన్నారు. అలాగే విద్య ఉపాధి కల్పనలో తెలుగు మహిళలను స్వతంత్రంగా అభివృద్ధివైపు అడుగులు వేయించారని  దేవతోటి నాగరాజు పేర్కొన్నారు. 

Updated Date - 2022-03-08T15:34:16+05:30 IST