‘వారిపై చర్యలు తీసుకోకపోవడం విడ్డూరంగా ఉంది’

ABN , First Publish Date - 2022-01-16T17:45:52+05:30 IST

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ పరిపాలన పూర్తిగా గాడి తప్పిందని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి దేవతోటి నాగరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసన తెలుపుతున్న అరవింద్ బాబుపై పోలీసులు దాడి చేయడం...

‘వారిపై చర్యలు తీసుకోకపోవడం విడ్డూరంగా ఉంది’

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ పరిపాలన పూర్తిగా గాడి తప్పిందని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి దేవతోటి నాగరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసన తెలుపుతున్న అరవింద్ బాబుపై పోలీసులు దాడి చేయడం నియంతృత్వ పాలనకు ప్రత్యక్ష నిదర్శనమన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ వ్యవస్థలు సక్రమంగా పనిచేయాలంటే రాష్ట్రపతి పరిపాలన మినహా మరేవిధమైన ఉత్తమ మార్గం కనిపించడం లేదన్నారు. కొంతమంది పోలీసులు వైసీపీ గుండాల మాదిరి ప్రవర్తిస్తున్నా ఉన్నత స్థాయి పోలీసులు వారిపై చర్యలు తీసుకోకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. 

Updated Date - 2022-01-16T17:45:52+05:30 IST