AP News: ఆ ఘనత వైసీపీదే: దేవతోటి
ABN , First Publish Date - 2022-07-31T18:23:35+05:30 IST
జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై టీడీపీ రాష్ట్ర కార్యదర్శి దేవతోటి నాగరాజు తీవ్ర విమర్శలు గుప్పించారు.
అమరావతి (Amaravathi): జగన్మోహన్ రెడ్డి (CM Jagan) ప్రభుత్వంపై టీడీపీ రాష్ట్ర కార్యదర్శి దేవతోటి నాగరాజు (Devathoti Nagaraju) తీవ్ర విమర్శలు గుప్పించారు. ఆదివారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ అన్నపూర్ణ (Annapurna)గా పేరుగాంచిన ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం (YCP Govt.) ఏర్పడిన నాటి నుంచి చీకటి కార్యకలాపాలకు కేరాఫ్ అడ్రస్గా నిలుస్తోందని ఆరోపించారు. క్యాసినో (Casino), డ్రగ్స్ (drugs) వంటి విదేశీ సంస్కృతి అలవాట్లను ఆంధ్రప్రదేశ్ పల్లెల వరకు తీసుకొచ్చిన ఘనత వైసీపీ ప్రభుత్వానిదేనన్నారు. వైసీపీ ప్రభుత్వంలో ఏ ఒక్క వర్గానికి కూడా మనశ్శాంతి లేకుండా పోయిందని దేవతోటి నాగరాజు అన్నారు.