ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడిగా దేవరాజులు
ABN , First Publish Date - 2022-05-29T07:13:53+05:30 IST
ఎస్టీయూ చిత్తూరు జిల్లా అధ్యక్షుడుగా దేవరాజులు ఎన్నికయ్యారు.
చిత్తూరు (సెంట్రల్), మే 28: ఎస్టీయూ చిత్తూరు జిల్లా అధ్యక్షుడుగా దేవరాజులు ఎన్నికయ్యారు. శనివారం తిరుపతిలోని గంథమనేని శివయ్య భవనంలో ఉమ్మడి చిత్తూరు జిల్లా మత్యంతర కౌన్సిల్ ఎస్టీయూ నూతన కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి రమణారెడ్డి, ఎన్నికల పరిశీలకులు గురుకుమార్ తెలిపారు. ప్రధాన కార్యదర్శిగా మోహన్, ఆర్థిక కార్యదర్శిగా మదన్మోహన్రెడ్డి, ఉపాధ్యక్షులుగా పాల్గుణముని, కిషోర్కుమార్రెడ్డి, జ్యోతి, ఉమ, సుబ్రమణ్యం, కమాలపతి, చెంగల్రాయ, అదనపు ప్రధాన కార్యదర్శులుగా సుబ్బరామ్, పవన్కుమార్, కార్యదర్శులుగా అమర్నాథ్, శ్రీనివాసులు, సుమతి, ప్రసూన, వెంకట్రామన్, సుబ్రమణ్యం, వెంకటేశయ్య, రామకృష్ణ, మహిళా కన్వీనర్గా వాణి లక్ష్మి, మైనారిటీ కన్వీనర్గా అలీఖాన్, సీపీఎస్ కన్వీనర్గా దామోదర్, ఉపాధ్యాయ వాణి కన్వీనర్గా సర్ధార్, ప్రచార కమిటీ కన్వీనర్గా పి.శ్రీనివాసులు ఎన్నికయ్యారు. వీరిని ఆ సంఘం రాష్ట్ర నాయకులు గంటా మోహన్ ఇతర నాయకులు అభినందనలు తెలిపారు.