జడ్పీ సీఈవోగా దేవానందరెడ్డి బాధ్యతల స్వీకరణ
ABN , First Publish Date - 2021-06-23T07:47:11+05:30 IST
జిల్లా పరిషత్ సీఈవోగా డి.దేవానందరెడ్డి మంగళవారం బాధ్యతలు స్వీకరించారు.
ఒంగోలు (జడ్పీ), జూన్ 22 : జిల్లా పరిషత్ సీఈవోగా డి.దేవానందరెడ్డి మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. అంతకుముందు ఆయన కలెక్టర్ ప్రవీణ్కుమార్ను మర్యాద పూర్వకంగా కలిశారు. బాధ్యతలు చేపట్టిన అనంతరం దేవానందరెడ్డికి డిప్యూటీ సీఈవో జాలిరెడ్డితోపాటు కార్యాలయ సిబ్బంది పుష్పగుచ్ఛాలు ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నాయకులు, మున్సిపల్ అధికారులు కూడా దేవానందరెడ్డిని కలిశారు. ఇప్పటి వరకూ సీఈవోగా విధులు నిర్వహించిన కైలాస్గిరీశ్వర్ బుధవారం ప్రభుత్వానికి రిపోర్టు చేయనున్నారు.