మోటర్సైకిల్, బస్సు ఢీ
ABN , First Publish Date - 2020-11-28T05:04:53+05:30 IST
మోటర్సైకిల్, బస్సు ఢీకొని ఒకరు మృతి చెందగా, మరొకరికి తీవ్ర గాయాలైన సంఘటన శుక్రవారం చోటు చేసుకుంది.
- ఒకరి మృతి.. మరొకరికి తీవ్ర గాయాలు
దేవనకొండ, నవంబరు 27: మోటర్సైకిల్, బస్సు ఢీకొని ఒకరు మృతి చెందగా, మరొకరికి తీవ్ర గాయాలైన సంఘటన శుక్రవారం చోటు చేసుకుంది. మండలంలోని కుంకనూరు క్రాస్రోడ్డు (బళ్లారి-కర్నూలు) రహదారి వద్ద ఈ ప్రమాదం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఆస్పరి మండలం చిరుమాన్దొడ్డి గ్రామానికి చెందిన నరసన్న పనినిమిత్తం దేవనకొండ మండలంలోని గుడిమిరాళ్ళ గ్రామానికి బయలుదేరాడు. గోనెగండ్ల మండలం పిల్లిగుండ్ల గ్రామానికి చెందిన బోయ గోవిందు ఆస్పరి మండలం బిల్లేకల్లు గ్రామంలో దేవనకొండకు వస్తానని నరసన్నను లిఫ్ట్ అడిగాడు. ఇద్దరు కలిసి బైక్పై దేవనకొండకు వస్తుండగా కుంకనూరు క్రాస్ వద్దకు రాగానే కర్నూలు నుంచి ఆలూరుకు వెళ్లుతున్న ఆర్టీసీ బస్సు, బైక్ ఢీకొనడంతో నరసన్న (40) అక్కడికక్కడే మృతి చెందాడు. గోవిందుకు తీవ్ర గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు. పత్తికొండ రూరల్ సీఐ ఆదినారాయణరెడ్డి, స్థానిక ఎస్ఐ నరసింహులు సంఘటన స్థలానికి వచ్చి ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.