అప్పు కోసం వ్యక్తి నిర్బంధం
ABN , First Publish Date - 2022-08-12T06:30:43+05:30 IST
నాలుగో పట్టణ పోలీస్స్టేషన్ పరిధిలో ఓ వ్యక్తిని అప్పు కోసం నిర్బంధించారు.
కర్నూలు, ఆగస్టు 11: నాలుగో పట్టణ పోలీస్స్టేషన్ పరిధిలో ఓ వ్యక్తిని అప్పు కోసం నిర్బంధించారు. కల్లూరు ఎస్టేట్కు చెందిన రెహిమాన్ అనే వ్యక్తి బాషా మియా, షేక్షావలిల దగ్గర లారీ డ్రైవర్గా పని చేస్తున్నాడు. వీరి వద్ద రూ.32వేలు అప్పు చేసి తిరిగి చెల్లించలేదు. ఈ నేపథ్యంలో ఆయనను గురువారం బల వంతంగా తీసుకువచ్చి ఓ కంటైనర్లో నిర్బంధించి తాళం వేశారు. ఆ తర్వాత విషయం బయటకు తేలడంతో పోలీసులు జోక్యం చేసుకుని ఆ వ్యక్తిని విడి పించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు ఆ ఇద్దరు లారీ యజమానులపై కేసు నమోదు చేసినట్లు సీఐ శంకరయ్య తెలిపారు.