పని ఇప్పిస్తామని యువతిని Hyderabad నుంచి ఢిల్లీకి రప్పించి.. ఏం చేశారో చూడండి..!
ABN , First Publish Date - 2022-05-15T19:27:18+05:30 IST
పని ఇప్పిస్తామని ఓ యువతిని ఢిల్లీ నుంచి నగరానికి పిలిపించి పడుపు వృత్తిలో దించారు. అంతటితో ఆగక ఆమెను వివస్త్రను చేసి నిర్బంధించి చిత్రహింసలకు గురిచేసిన ముగ్గురు యువతులను బంజారాహిల్స్ పోలీసులు అరెస్టు చేశారు..
యువతిని వివస్త్రను చేసి..
అక్కడ పరిచయమైన కోమటి, సునీతలు మసాజ్తోపాటు ఇతర పనులు చేస్తే మరిన్ని డబ్బులు వస్తాయని చెప్పడంతో సదరు యువతి అంగీకరించింది. ఈనెల 12న కోమటి, సునీత, ఆ యువతి జూబ్లీహిల్స్లో కొందరికి థెరపీ చేసి బయటకు వచ్చాక వారి మధ్య గొడవ జరిగింది. కోల్కతా యువతి 100 డయల్కు ఫోన్ చేయడంతో జూబ్లీహిల్స్ పోలీసులు వచ్చి సర్ది చెప్పి పంపించారు. అనంతరం ఆ యువతి, కోమటి, సునీతలు వేర్వేరు కారులో వచ్చి జూబ్లీహిల్స్లో జరిగిన విషయాన్ని సంజనాకు చెప్పారు.