దేవాలయాల భూముల వివరాలు అందజేయాలి

ABN , First Publish Date - 2022-05-22T06:35:04+05:30 IST

జిల్లాలోని దేవాలయాలకు సంబంధించిన భూములను, అర్చక స్వాధీనంలో ఉన్న భూముల వివరాలను పూర్తి స్థా యిలో విచారణ చేసి జిల్లా దేవాదాయ శాఖ కార్యాలయాలనికి అందజేయాలని దేవాదాయ శాఖ ఏసీ సులోచన ఆలయాల అధికారులను ఆదేశించారు.

దేవాలయాల భూముల వివరాలు అందజేయాలి
భూముల రికార్డులను పరిశీలిస్తున్న సులోచన

నల్లగొండ, కల్చరల్‌, మే 21: జిల్లాలోని దేవాలయాలకు సంబంధించిన భూములను, అర్చక స్వాధీనంలో ఉన్న భూముల వివరాలను పూర్తి స్థా యిలో విచారణ చేసి జిల్లా దేవాదాయ శాఖ కార్యాలయాలనికి అందజేయాలని దేవాదాయ శాఖ ఏసీ సులోచన ఆలయాల అధికారులను ఆదేశించారు. శనివారం జిల్లా కేంద్రంలోని దేవాదాయ శాఖ కార్యాలయంలో దేవాలయాల కార్యనిర్వాహణ అధికారులు, మేనేజర్లతో జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడారు. జిల్లాలో దేవాలయ భూముల పరిరక్షణ, అన్యాక్రాంతం కాకుండా చూడటం, దేవాలయాల భూములను ఆక్రమించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. జిల్లాలోని దేవాలయాల భూముల పూర్తి వివరాలను విచారణ చేసి త్వరితగతిన అందజేయాలని ఆదేశించారు. సమావేశంలో కార్యనిర్వాహణ అధికారులు, మేనేజర్లు పాల్గొన్నారు. 



Updated Date - 2022-05-22T06:35:04+05:30 IST