పరికిబండలో పాఠశాల ఫర్నీచర్‌ ధ్వంసం

ABN , First Publish Date - 2022-05-23T05:04:02+05:30 IST

పాఠశాల తాళాలు పగలగొట్టి ఫర్నిచర్‌, కుర్చీలు, టేబుళ్లు, సీలింగ్‌ ఫ్యాన్లను ధ్వంసం చేశారు.

పరికిబండలో పాఠశాల ఫర్నీచర్‌ ధ్వంసం

తూప్రాన్‌ (మనోహరాబాద్‌), మే 22: పాఠశాల తాళాలు పగలగొట్టి ఫర్నిచర్‌, కుర్చీలు, టేబుళ్లు, సీలింగ్‌ ఫ్యాన్లను ధ్వంసం చేశారు. ఈ సంఘటన మనోహరాబాద్‌ మండలం పరికిబండలో శనివారం రాత్రి చోటు చేసుకుంది. గ్రామస్థులు, పోలీసుల కథనం ప్రకారం... మనోహరాబాద్‌ మండలం పరికిబండ హైస్కూల్‌ తాళాలను శనివారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు పగలగొట్టారు. పాఠశాలలోకి వెళ్లి పాఠశాలలో ఉన్న సుమారు 50 ప్లాస్టిక్‌ కుర్చీలు, కంప్యూటర్‌ టేబుళ్లు, సీలింగ్‌ ప్యాన్లతో పాటు ఫర్నీచర్‌ను ధ్వంసం చేశారు.  కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ రాజుగౌడ్‌ వివరించారు. 

Updated Date - 2022-05-23T05:04:02+05:30 IST