గుంటూరు టీడీపీ కార్యాలయంలో నేతల విధ్వంసం
ABN , First Publish Date - 2021-08-08T01:16:46+05:30 IST
జిల్లా టీడీపీ కార్యాలయంలో ప్రత్తిపాడు టీడీపీ నేతలు దాడులకు దిగారు. రెండు
గుంటూరు: జిల్లా టీడీపీ కార్యాలయంలో ప్రత్తిపాడు టీడీపీ నేతలు దాడులకు దిగారు. రెండు వర్గాలుగా విడిపోయి కర్రలతో ఒకరిపై మరొకరు పరస్పరం దాడులు చేసుకున్నారు. ప్రత్తిపాడు నియోజకవర్గం కన్వీనర్గా మాకినేనిని తొలగించాలని ఓ వర్గం డిమాండ్ చేసింది. దీంతో వారిపై దాడికి మరో వర్గం పాల్పడింది. ఆఫీస్ ఫర్నిచర్ను ధ్వంసం చేశారు. ఈ ఘటనతో టీడీపీలో అంతర్గతంగా ఉన్న విభేదాలు మరోసారి బయటపడ్డాయి.