కొవిడ్‌ వల్ల భారత్‌ సర్వనాశనం : ట్రంప్‌

ABN , First Publish Date - 2021-06-18T09:10:21+05:30 IST

ప్రపంచ వ్యాప్తంగా కొవిడ్‌-19 వ్యాప్తికి చైనాయే కారణమని అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ ఆరోపించారు. కరోనా వల్ల భారత్‌ సర్వనాశనమైందన్నారు. ఫాక్స్‌న్యూ్‌సకు గురువారం ఆయన ఇంటర్వ్యూ ఇచ్చారు

కొవిడ్‌ వల్ల భారత్‌ సర్వనాశనం : ట్రంప్‌

అమెరికాకు చైనా 742 లక్షల కోట్లు ఇవ్వాలి 


వాషింగ్టన్‌, జూన్‌ 17: ప్రపంచ వ్యాప్తంగా కొవిడ్‌-19 వ్యాప్తికి చైనాయే కారణమని అమెరికా మాజీ  అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ ఆరోపించారు. కరోనా వల్ల భారత్‌ సర్వనాశనమైందన్నారు. ఫాక్స్‌న్యూ్‌సకు గురువారం ఆయన ఇంటర్వ్యూ ఇచ్చారు. కరోనా వ్యాప్తికి బాధ్యత వహిస్తూ చైనా అమెరికాకు రూ.742,32,600 కోట్లు(10 ట్రిలియన్‌ డాలర్లు)చెల్లించాలన్నారు. వాస్తవానికి చైనా ప్రపంచానికి చాలా ఎక్కువే చెల్లించాలని, అయితే దాని సామర్థ్యం ఇంతేనని చెప్పారు. వారు చేసిన చర్యలవల్ల చాలా దేశాలు నాశనమయ్యాయన్నారు. ప్రజారోగ్యం విషయంలో  తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న భారత్‌ను ఉదాహరణగా పేర్కొన్నారు.

Updated Date - 2021-06-18T09:10:21+05:30 IST