ఎస్పీ సమక్షంలో అక్రమ మద్యం ధ్వంసం
ABN , First Publish Date - 2022-05-27T06:10:45+05:30 IST
పలు కేసులలో పట్టుబడినటువంటి అక్రమ మద్యా న్ని గురువారం ఎస్పీ ఫక్కీరప్ప సమక్షంలో ధ్వసం చేశారు.
డీ హీరేహాళ్, మే 26: పలు కేసులలో పట్టుబడినటువంటి అక్రమ మద్యా న్ని గురువారం ఎస్పీ ఫక్కీరప్ప సమక్షంలో ధ్వసం చేశారు. 2020 మే నుంచి 2021 డిసెంబరు వరకు 290 కేసుల్లో 4860 లీటర్ల అక్రమ మద్యం పట్టుబ డినట్లు ఎస్పీ తెలిపారు. దీని విలువ సుమారు రూ. 18 లక్షలు వుంటుందని తెలియజేశారు. ఈ పట్టుబడిన అక్రమ మద్యాన్ని మొత్తం గురువారం వాహ నాల ద్వారా ధ్వంసం చేసినట్లు తెలిపారు. అనంతరం పోలీస్స్టేషన్లో రికా ర్డులను పరిశీలించారు. ఏమైనా సమస్యలు వున్నాయా అని సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఎస్పీ వెంట డీఎస్పీ ప్రసాదరెడ్డి, సెబ్ ఏసీ శ్రీనివాసరావు, సీఐ యుగంధర్, సెబ్ సీఐలు హిమబింధు, నరసానాయుడు, ఎస్ఐ రామకృష్ణా రెడ్డి, ఆర్ఐ రామాంజినేయులు, రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.