నిజామాబాద్: జిల్లాలో మత విశ్వాసాలను దెబ్బతీసే దారుణ సంఘటన జరిగింది. గుడిలోని విగ్రహాలను దుండగులు ధ్వంసం చేశారు. నవీపేట మండలం ధర్యాపూర్లో ఈ సంఘటన చోటుచేసుకుంది. గ్రామంలో ఎంతో కాలం నుంచి మహాలక్ష్మి మందిరం ఉంది. ఈ గుడిలోని చిలుకమ్మ, మంగమ్మ విగ్రహాలను గుర్తుతెలియని దుండగులు ధ్వంసం చేశారు. దీంతో గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు. నిందితులను వెంటనే పట్టుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. ఘటనా స్థలానికి చేరుకొన్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిందితులను పట్టుకోవడానికి పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.