800 లీటర్ల బెల్లం ఊటల ధ్వంసం
ABN , First Publish Date - 2021-07-29T05:23:06+05:30 IST
గరుగుబిల్లి గ్రామసమీపంలో నాటుసారా తయారీకి సిద్ధంగా ఉన్న పులుసిన బెల్లం ఊటలను స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు బుధ వారం ధ్వంసం చేశారు.
మెరకముడిదాం, జూలై 28 : గరుగుబిల్లి గ్రామసమీపంలో నాటుసారా తయారీకి సిద్ధంగా ఉన్న పులుసిన బెల్లం ఊటలను స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు బుధ వారం ధ్వంసం చేశారు. ఎన్ఫోర్స్ మెంట్ బ్యూరో ఇన్స్పెక్టర్ పి.ఉమా మహేశ్వరావు అధ్వర్యంలో ఈదాడు లు చేపట్టారు. సారా తయారీకి సిద్ధం చేసిన 800 లీటర్ల ఊటలను ధ్వంసం చేశారు.