విధ్వంసాలే ప్రభుత్వ లక్ష్యం
ABN , First Publish Date - 2022-09-25T05:59:12+05:30 IST
అభివృద్ధి, ప్రజాసంక్షేమం కంటే విధ్వంసాలు సృష్టించడమే వైసీపీ ప్రభుత్వం లక్ష్యంగా ఉందని తిరువూరు నియోజకవర్గం టీడీపీ ఇన్చార్జి శావల దేవదత్ విమర్శించారు.
తిరువూరు నియోజకవర్గం టీడీపీ ఇన్చార్జి శావల దేవదత్
తిరువూరు, సెప్టెంబరు 24: అభివృద్ధి, ప్రజాసంక్షేమం కంటే విధ్వంసాలు సృష్టించడమే వైసీపీ ప్రభుత్వం లక్ష్యంగా ఉందని తిరువూరు నియోజకవర్గం టీడీపీ ఇన్చార్జి శావల దేవదత్ విమర్శించారు. హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరు మార్పును నిరసిస్తూ టీడీపీ అధ్వర్యంలో జైభావి సెంటర్లోని ఎన్టీఆర్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. పట్టణ టీడీపీ అధ్యక్షుడు బొమ్మసాని మహేష్ ఆధ్వర్యంలో కందిమళ్ళ శేషగిరిరావు, సింధు శ్రీను, ఆకుల దుర్గాప్రసాద్, టీడీపీ మున్సిపల్ ఫ్లోర్లీడర్ షేక్ అబ్దుల్ హుస్సేన్, వాసం మునియ్య, పర్వతం శ్రీనివాసరావు, పంది శ్రీను, మార్కెండేశ్వరరావు, సోమవరపు శ్రీనివాసరావు, బల్లిపోగు శ్యామ్, పాల్గొన్నారు.
విస్సన్నపేటలో ఎన్టీఆర్ విగ్రహానికి పాలాభిషేకం