భర్తతో కలిసి ఉండలేనని తేల్చి చెప్పిన భార్య.. ఆమె మీద కోపంతో అతడు రెండుసార్లు అలా చేసినప్పటికీ..

ABN , First Publish Date - 2021-12-03T23:03:41+05:30 IST

అతడికి భార్య అంటే చాలా ఇష్టం. ఆమె అంటే ప్రేమ ఉన్నప్పటికీ.. కుటుంబ కలహాల వల్ల ఇద్దరి మధ్య గొడవలు మొదలై తీవ్రస్థాయికి చేరాయి. దీంతో ఆమె అతడితో కలిసి ఉండలేనని తేల్చి

భర్తతో కలిసి ఉండలేనని తేల్చి చెప్పిన భార్య.. ఆమె మీద కోపంతో అతడు రెండుసార్లు అలా చేసినప్పటికీ..

అతడికి భార్య అంటే చాలా ఇష్టం. ఆమె అంటే ప్రేమ ఉన్నప్పటికీ.. కుటుంబ కలహాల వల్ల ఇద్దరి మధ్య గొడవలు మొదలై తీవ్రస్థాయికి చేరాయి. దీంతో ఆమె అతడితో కలిసి ఉండలేనని తేల్చి చెప్పింది. తనను విడిచివెళ్లొద్దని అతడు భార్యను ప్రాధేయపడ్డాడు. కానీ ఆమె వినకుండా ఇంకా గొడవ పెద్దది చేసింది. అపుడు ఆ భర్త భార్యపై కోపంతో రెండుసార్లు అలా చేసినప్పటికీ విఫలమయ్యాడు. అసలేం జరిగిందనే పూర్తి వివరాల్లోకెళ్తే..


రాజస్థాన్‌లోని బుండి గ్రామానికి చెందిన 25 ఏళ్ల భోజ్‌రామ్‌కు ఏడాది క్రితం యునైరా గ్రామానికి చెందిన అంటిటాతో వివాహం జరిగింది. ఈ దంపతులకు ఇటీవలే పండంటి పాప జన్మించింది. పెళ్లి జరిగిన కొద్దిరోజుల తర్వాత నుంచే కుటుంబ కలహాలు మొదలయ్యాయి. ఇద్దరి మధ్య గొడవలు ఎక్కువవడంతో అంటిటా పుట్టింటికి వెళ్లిపోయింది. భోజ్‌రామ్ అత్తారింటికి వెళ్లి భార్యను ఒప్పించి ఆరు రోజుల క్రితం తీసుకుని వచ్చాడు. అయితే గురువారం రాత్రి వీరిద్దరి మధ్య మళ్లీ గొడవ జరిగింది. అపుడు ఆమె అతడితో కలిసి బతకలేనని తేల్చి చెప్పింది. భర్త తనతో కలిసి ఉండమని భార్యను ప్రాధేయపడ్డాడు. అయినా ఆమె అతడి మాట వినలేదు. ఇద్దరి మధ్య మాటామాటా పెరిగింది. దీంతో కుటుంబసభ్యులు కలగజేసుకుని వారికి నచ్చజెప్పారు. గొడవ సద్దుమణిగాక భోజ్‌రామ్ భార్యపై కోపంతో ఎవరికీ కనిపించకుండా రెండుసార్లు ఎలుకల మందు తిని ఆత్మహత్యకు యత్నించి విఫలమయ్యాడు. ఈ క్రమంలోనే శుక్రవారం ఉదయం 5 గంటలకు ఇంటి ముందున్న గేటు దగ్గర నిల్చొని.. తాను రెండుసార్లు ఎలుకల మందు తిన్నప్పటికీ చనిపోలేదని.. దీంతో పెట్రోల్ పోసుకున్నాని చెప్తూనే నిప్పంటించుకున్నాడు. వెంటనే కుటుంబసభ్యులు మంటలు ఆర్పినప్పటికీ 25 శాతం శరీరం కాలిపోయింది. అతడిని ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు.



Updated Date - 2021-12-03T23:03:41+05:30 IST