అల్లూరి జిల్లా కేంద్రంలో తీరని పెట్రోల్‌ సమస్య

ABN , First Publish Date - 2022-05-25T06:20:52+05:30 IST

అల్లూరి జిల్లా కేంద్రం పాడేరులో నాలుగు పెట్రో ల్‌ బంక్‌లు ఉన్నప్పటికీ ఇక్కడ ప్రజలకు ఇంధన కష్టాలు తీర డం లేదు.

అల్లూరి జిల్లా కేంద్రంలో తీరని పెట్రోల్‌ సమస్య
బంక్‌ వద్ద బారులు తీరిన వాహనదారులు


పాడేరురూరల్‌, మే 24: అల్లూరి జిల్లా కేంద్రం పాడేరులో నాలుగు పెట్రో ల్‌ బంక్‌లు ఉన్నప్పటికీ ఇక్కడ ప్రజలకు ఇంధన కష్టాలు తీర డం లేదు. బంక్‌లకు ఇంధనం ఎప్పుడు వస్తాదోనని వాహనదారులు చకోరపక్షుల్లా ఎదురుచూస్తున్నారు. పట్టణంలోని రెండు బంక్‌లకు మంగళవారం రెండు ట్యాంకర్లతో పెట్రోల్‌, డీజిల్‌ వచ్చినప్పటికి ఒక పూటకే అయిపోవడంతో మరళ ట్యాంకర్‌ ఎప్పుడు వస్తాదోనని వాహనదారులు ఎదురుచూస్తున్నారు. మంగళవారం రెండు బంక్‌లకు 8వేల లీటర్లు పెట్రోలు, 16వేల లీటర్లు డీజిల్‌ వచ్చింది. ఇంధనం వచ్చిన నాలుగైదు గంటల్లోనే పెట్రోల్‌ అయిపోగా డీజిల్‌ సాయంత్రం ఐదు గంటల సమయానికి ఖాళీ అయిపోయింది. 

Updated Date - 2022-05-25T06:20:52+05:30 IST