‘వాహనమిత్ర’ అమలులో జిల్లాకు ప్రథమ స్థానం

ABN , First Publish Date - 2020-07-05T09:45:14+05:30 IST

ఆటో, ట్యాక్సీ వాహన యజమానులను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన వాహనమిత్ర అమలులో రాష్ట్రంలోనే జిల్లా

‘వాహనమిత్ర’ అమలులో జిల్లాకు ప్రథమ స్థానం

విశాఖపట్నం, జూలై 4(ఆంధ్రజ్యోతి): ఆటో, ట్యాక్సీ వాహన యజమానులను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన వాహనమిత్ర అమలులో రాష్ట్రంలోనే జిల్లా ప్రథమ స్థానంలో నిలిచిందని రవాణాశాఖ ఉప కమిషనర్‌ రాజారత్నం తెలిపారు. ఆటో, ట్యాక్సీ యజమానులకు ‘వైఎస్‌ఆర్‌ వాహనమిత్ర’ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం రూ.పది వేలు చొప్పున అందజేస్తున్న విషయం తెలిసిందే. 2020-21 సంవత్సరానికిగానూ జిల్లాలో రూ.30 కోట్లు 38,001 మంది లబ్ధిదారుల ఖాతాల్లో వేశామని ఆయన తెలిపారు. ఇది రాష్ట్రంలోనే అత్యధికం కావడంతో జిల్లా ప్రథమస్థానంలో నిలిచిందన్నారు. 29,965 మంది లబ్ధిదారులతో కృష్ణా జిల్లా రెండో స్థానంలో నిలవగా, 29,628 మంది లబ్ధిదారులతో తూర్పుగోదావరి జిల్లా మూడో స్థానంలో నిలిచిందని తెలిపారు. 

Updated Date - 2020-07-05T09:45:14+05:30 IST