జగన్‌పై ప్రజలే దాడి చేస్తారు: ఏపీ డిప్యూటీ సీఎం సంచలన వ్యాఖ్యలు

ABN , First Publish Date - 2021-09-29T16:06:45+05:30 IST

కుడి ఎడమైతే పొరపాటు లేదోయ్.. అన్నారు కదాని.. కానివారిని తిట్టబోయి.. అయిన వారిపై నోరు పారేసుకుంటే మాత్రం కచ్చితంగా పొరపాటే. అలాంటి పొరపాటునే ఏపీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి చేశారు.

జగన్‌పై ప్రజలే దాడి చేస్తారు: ఏపీ డిప్యూటీ సీఎం సంచలన వ్యాఖ్యలు

తిరుమల: కుడి ఎడమైతే పొరపాటు లేదోయ్.. అన్నారు కదాని.. కానివారిని తిట్టబోయి.. అయిన వారిపై నోరు పారేసుకుంటే మాత్రం కచ్చితంగా పొరపాటే. అలాంటి పొరపాటునే ఏపీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి చేశారు. స్వామి భక్తిని చాటుకునేందుకు ఏపీ వైసీపీ నేతలంతా పోటాపోటీగా ప్రెస్‌మీట్‌లు పెట్టి జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై దుమ్మెత్తిపోసే కార్యక్రమాన్ని తాజాగా పెట్టుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే డిప్యూటీ సీఎం నారాయణస్వామి సైతం స్వామి భక్తి చాటుకునేందుకు సిద్ధమయ్యారు. అయితే ఆయన పవన్‌పై దూషణ పర్వంలో భాగంగా జగన్‌పై విమర్శలు చేయడం చర్చనీయాంశంగా మారింది. పవన్‌పై ప్రజలే దాడి చేస్తారనడానికి బదులు జగన్‌పై ప్రజలే దాడి చేస్తారంటూ వ్యాఖ్యానించి నాలుక్కరుచుకున్నారు. అసలే సోషల్ మీడియా.. ఇలా హింట్ ఇస్తే అలా అల్లుకుపోతుంది. మరి ఇక నారాయణ స్వామిని వదులుతుందా.. మీమ్స్.. సెటైర్స్‌తో నెటిజనం ఆటాడేసుకుంటోంది. 

Updated Date - 2021-09-29T16:06:45+05:30 IST