అర్హులందరికీ ఇళ్ల పట్టాలు : డిప్యూటీ సీఎం

ABN , First Publish Date - 2020-06-04T10:45:04+05:30 IST

అర్హులందరికీ ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తామని డిప్యూటీ సీఎం నారాయణస్వామి పేర్కొన్నారు.

అర్హులందరికీ ఇళ్ల పట్టాలు : డిప్యూటీ సీఎం

కార్వేటినగరం/వెదురుకుప్పం, జూన్‌ 3:అర్హులందరికీ ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తామని డిప్యూటీ సీఎం నారాయణస్వామి పేర్కొన్నారు. బుధవారం ఆయన కార్వేటినగరం సమీపంలో ఇళ్ళ పట్టాల పంపిణీకి సిద్ధంగా ఉన్న స్థలాన్ని  పరిశీలించారు. ఇళ్ల నిర్మాణాలకు స్థలం అనువుగా ఉందా, తాగునీటి సౌకర్యం కల్పించడంపై ఆయన అధికారులతో చర్చించారు. వెదురుకుప్పం ప్రభుత్వ డిగ్రీ కళాశాల భవన నిర్మాణానికి పచ్చికాపల్లం సమీపంలో కేటాయించిన స్థలాన్ని కూడా డిప్యూటీ సీఎం పరిశీలించారు. టీఆర్‌పురంలో తాగునీటి పథకాన్ని ప్రారంభించారు. 

Updated Date - 2020-06-04T10:45:04+05:30 IST