జవాద్ తుఫాన్...అధికారులంతా అప్రమత్తంగా ఉండాలి: Krishna das

ABN , First Publish Date - 2021-12-03T17:29:03+05:30 IST

జవాద్ తుఫాన్ రాత్రికి తీరం దాటే అవకాశం ఉందని... అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని డిప్యూటీ సీఎం కృష్ణదాసు ఆదేశించారు.

జవాద్ తుఫాన్...అధికారులంతా అప్రమత్తంగా ఉండాలి: Krishna das

శ్రీకాకుళం: జవాద్ తుఫాన్ రాత్రికి తీరం దాటే అవకాశం ఉందని... అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని డిప్యూటీ  సీఎం కృష్ణదాసు ఆదేశించారు. 11 తీర ప్రాంత మండలాల్లో ప్రభావం ఉండవచ్చన్నారు. ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సిద్ధంగా ఉన్నాయన్నారు. తుఫాన్ అనంతర చర్యలపై ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని సూచించారు. డ్రింకింగ్ వాటర్, విద్యుత్ పునరుద్ధరణపై సన్నద్ధంగా ఉండాలని తెలిపారు. కంట్రోల్ రూమ్స్ ద్వారా పరిస్థితిని సమీక్షిస్తున్నామని చెప్పారు. ఎలాంటి విపత్కర పరిస్థితిని అయినా ఎదుర్కోవటానికి యంత్రాంగం సిద్ధంగా ఉందని డిప్యూటీ సీఎం కృష్ణదాస్ పేర్కొన్నారు. 

Updated Date - 2021-12-03T17:29:03+05:30 IST