ఏపీజీబీ ఆధ్వర్యంలో డిపాజిట్‌ సేకరణ మహోత్సవం

ABN , First Publish Date - 2021-07-31T05:10:33+05:30 IST

ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకు రాజంపేట ప్రాంతీయ కార్యాలయంలో శుక్రవారం రీజనల్‌ మేనేజర్‌ పి.శ్రీదేవి ఆధ్వర్యంలో డిపాజిట్‌ సేకరణ మహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఏపీజీబీ ఆధ్వర్యంలో డిపాజిట్‌ సేకరణ మహోత్సవం
పోస్టర్‌ ఆవిష్కరిస్తున్న ఏపీజీబీ రీజనల్‌ మేనేజర్‌ శ్రీదేవి

రాజంపేట, జూలై30  : ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకు రాజంపేట ప్రాంతీయ కార్యాలయంలో శుక్రవారం రీజనల్‌ మేనేజర్‌ పి.శ్రీదేవి ఆధ్వర్యంలో డిపాజిట్‌ సేకరణ మహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకుల కంటే ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకులోనే డిపాజిట్లకు అధిక వడ్డీ ఇవ్వడం జరుగుతుందన్నారు.  అదే విధంగా ఖాతాదారుల అవసరం నిమిత్తం బంగారు మీద ప్రగతి స్వర్ణ స్ర్పింట్‌ పథకం కింద 75పైసలకే రుణాలు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. రాజంపేట బ్రాంచ్‌ మేనేజర్‌ రఘునాఽథరెడ్డి, ఆర్‌ఎ్‌సరోడ్డు బ్రాంచ్‌ మేనేజర్‌ మంజునాఽథ్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-07-31T05:10:33+05:30 IST