దుకాణం ఖాళీ చేశారని..

ABN , First Publish Date - 2022-01-29T03:50:24+05:30 IST

కొత్తపేటలోని రెడ్డి షాపింగ్‌ కాంప్లెక్స్‌లో దుకాణాన్ని ఖాళీ చేయించిన యజమాని తీరుపై అద్దెదారుడు నిరసన తెలిపాడు. కుటుంబంతో రహదారిపై బైఠాయించాడు. కొత్తపేటకు చెందిన కోరాడ క్రాంతి.. రెడ్డి షాపింగ్‌ కాంప్లెక్స్‌లోని ఓ అద్దె దుకాణంలో గిఫ్ట్స్‌ అండ్‌ బుక్‌హౌస్‌ నిర్వహిస్తున్నారు. షాపింగ్‌ కాంప్లెక్స్‌ యజమాని రాముపాత్రుని రంగారెడ్డి

దుకాణం ఖాళీ చేశారని..
రోడ్డుపై భైఠాయించిన క్రాంతి దంపతులు

- యజమాని తీరుపై అద్దెదారుడి నిరసన

- కుటుంబంతో రోడ్డుపై బైఠాయింపు

కోటబొమ్మాళి, జనవరి 28 : కొత్తపేటలోని రెడ్డి షాపింగ్‌ కాంప్లెక్స్‌లో దుకాణాన్ని ఖాళీ చేయించిన యజమాని తీరుపై అద్దెదారుడు నిరసన తెలిపాడు. కుటుంబంతో రహదారిపై బైఠాయించాడు. కొత్తపేటకు చెందిన కోరాడ క్రాంతి.. రెడ్డి షాపింగ్‌ కాంప్లెక్స్‌లోని ఓ అద్దె దుకాణంలో గిఫ్ట్స్‌ అండ్‌ బుక్‌హౌస్‌ నిర్వహిస్తున్నారు. షాపింగ్‌ కాంప్లెక్స్‌ యజమాని రాముపాత్రుని రంగారెడ్డి శుక్రవారం ఆ దుకాణాన్ని ఖాళీ చేయించారు. దుకాణంలోని కొన్ని వస్తువులను బయటపడవేశారు. దీంతో క్రాంతి తన భార్య అప్పలనరసమ్మ(కావ్య)తో కలిసి రోడ్డుపై బైఠాయించారు. యజమాని తీరుపై నిరసన తెలిపారు. కరోనా కారణంగా రెండు నెలలుగా అద్దె చెల్లింపు ఆలస్యమవుతోందని... రెండు రోజులు గడువు కోరినా యజమాని దారుణంగా ఖాళీ చేయించారని వాపోయారు. బయటపడేసిన సామగ్రి లోపల పెట్టాలని డిమాండ్‌ చేశారు. ఈ విషయమై యజమాని రంగారెడ్డి వద్ద ‘ఆంధ్రజ్యోతి’ ప్రస్తావించగా.. తనకు ఈ దుకాణం అవసరమని, రెండు నెలలుగా ఖాళీ చేయాలని చెబుతున్నా.. పట్టించుకోవడం లేదన్నారు. అందుకే ఖాళీ చేయించాను తప్ప అద్దె కోసం కాదని స్పష్టం చేశారు. ఈ ఘటనతో కొత్తపేట-కోటబొమ్మాళి రహదారిలో ట్రాఫిక్‌  కు అంతరాయం కలిగింది. దీంతో ఎస్‌ఐ వై.రవికుమార్‌.. పోలీసు సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఇద్దరితో చర్చించి.. సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టారు. అనంతరం ఈ సంఘటనపై క్రాంతి భార్య అప్పలనరసమ్మ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దీనిపై ఎస్‌ఐ రవికుమార్‌ను వివరణ కోరగా.. ఇరువర్గాల మధ్య రాజీమార్గంతో సమస్య పరిష్కరిస్తామని తెలిపారు. 

 



Updated Date - 2022-01-29T03:50:24+05:30 IST