విదేశీ వర్కర్ల విషయమై సింగపూర్ సంచలన నిర్ణయం !
ABN , First Publish Date - 2021-03-04T01:26:22+05:30 IST
సింగపూర్లోని విదేశీ కార్మికుల విషయమై ఆ దేశ మ్యాన్పవర్ మినిస్ట్రీ తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది.
సింగపూర్ సిటీ: సింగపూర్లోని విదేశీ కార్మికుల విషయమై ఆ దేశ మ్యాన్పవర్ మినిస్ట్రీ తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. సింగపూర్లో పనిచేస్తున్న విదేశీయుల భాగస్వాములు, కుటుంబ సభ్యులు ఎవరైతే డిపెండెంట్ పాస్(డీపీ)లు కలిగి ఉన్నారో వారు ఇకపై తప్పని సరిగా వర్క్ పాస్లను పొందాల్సి ఉంటుందని మంత్రిత్వశాఖ బుధవారం వెల్లడించింది. డిపెండెంట్ పాస్ గల విదేశీయులు సింగపూర్లో ఉపాధి కోసం మినిస్ట్రీ నుంచి సమ్మతి లేఖ(ఎల్ఓసీ) తీసుకోవాలని అధికారులు సూచించారు. ఈ ప్రక్రియ కోసం డీపీ గల విదేశీయులకు తగినంత సమయంలో ఇస్తామని మంత్రి జోసెఫిన్ టీయో తెలిపారు. ఆ సమయంలోపు విదేశీయులు తప్పకుండా వర్క్ పాస్లను తీసుకోవాల్సి ఉంటుందని ఆమె స్పష్టం చేశారు.