కరోనా చికిత్సకు డెంగీ మందు!
ABN , First Publish Date - 2020-06-07T08:19:38+05:30 IST
కరోనా చికిత్సకు డెంగీ మందు!
న్యూఢిల్లీ, జూన్ 6: మొక్కల నుంచి తయారు చేసిన పైటో ఫార్మాసూటికల్ ఔషధం ‘ఏక్యూసీహెచ్’పై శుక్రవారం క్లినికల్ ట్రయల్స్ మొదలయ్యాయి. డెంగీ కోసం తయారు చేసిన ఈ ఔషధాన్ని.. కరోనా రోగులపై క్లినికల్ ట్రయల్స్ నిర్వహించేందుకు భారత ఔషధ మండలి శుక్రవారం అనుమతించింది. ముంబైకి చెందిన సన్ ఫార్మాసూటికల్ సంస్థ తయారు చేసిన ఈ ఔషధాన్ని దేశంలో 210 మంది రోగులపై ప్రయోగిస్తారు.