టీడీపీ కాగడాల ప్రదర్శన

ABN , First Publish Date - 2022-05-23T06:09:37+05:30 IST

దళిత యువకుడు సుబ్రహ్మణ్యం హత్య కేసులో ప్రధాన నిందితుడైన వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబును తక్షణమే అరెస్టు చేయాలని తెలుగుదేశం పార్టీ అరకులోయ పార్లమెంట్‌ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి కిడారి శ్రావణ్‌కుమార్‌ డిమాండ్‌ చేశారు.

టీడీపీ కాగడాల ప్రదర్శన
పాడేరులో కాగడాల ప్రదర్శన నిర్వహిస్తున్న మాజీ మంత్రి కిడారి శ్రావణ్‌కుమార్‌ తదితరులు

 వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబును అరెస్టు చేయాలని డిమాండ్‌

పాడేరు, మే 22(ఆంధ్రజ్యోతి): దళిత యువకుడు సుబ్రహ్మణ్యం హత్య కేసులో ప్రధాన నిందితుడైన వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబును తక్షణమే అరెస్టు చేయాలని తెలుగుదేశం పార్టీ అరకులోయ పార్లమెంట్‌ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి కిడారి శ్రావణ్‌కుమార్‌ డిమాండ్‌ చేశారు. ఎమ్మెల్సీ అనంతబాబును అరెస్టు చేయాలనే డిమాండ్‌తో ఆదివారం రాత్రి  పాడేరులో కాగడాలతో నిరసన ప్రదర్శన చేపట్టారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి కిడారి శ్రావణ్‌కుమార్‌ మాట్లాడుతూ వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అన్నివర్గాల ప్రజలపై హత్యలు, అఘాయిత్యాలు, హింస, బెదిరింపులు, దౌర్జన్యాలు అధికమయ్యాయని ఆరోపించారు. దళిత యువకుడి హత్య ఘటనపై పోలీసు వ్యవస్థ నిష్పక్షపాతంగా వ్యవహరించి ఎమ్మెల్సీ అనంతబాబును అరెస్టు చేయాలని, లేకుంటే ఉద్యమం తీవ్రం చేస్తామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు బాకూరు వెంకటరమణరాజు, పాండురంగస్వామి, టి.సత్యనారాయణ, శశిభూషణ్‌, వెంకటరావు, మహేశ్వరి, త్రినాథ్‌, ప్రసాద్‌, మహేశ్‌, తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2022-05-23T06:09:37+05:30 IST