శివగంగా జిల్లాలో రూ.4.8 కోట్ల పాత కరెన్సీనోట్లు స్వాధీనం

ABN , First Publish Date - 2021-04-13T12:50:15+05:30 IST

ఓ ఇంట్లో దాచి ఉంచిన రద్దు అయిన పాత కరెన్సీనోట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్న ఘటన...

శివగంగా జిల్లాలో రూ.4.8 కోట్ల పాత కరెన్సీనోట్లు స్వాధీనం

శివగంగా(తమిళనాడు): ఓ ఇంట్లో దాచి ఉంచిన రద్దు అయిన పాత కరెన్సీనోట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్న ఘటన తమిళనాడు రాష్ట్రంలోని శివగంగా జిల్లాలో వెలుగుచూసింది. శివగంగా జిల్లా కలయార్కోయిల్ ప్రాంతానికి చెందిన ఫిజియోథెరపిస్టు అరుల్ చిన్నప్పన్ ఇంట్లో పాత కరెన్సీనోట్లు పెద్ద మొత్తంలో ఉన్నాయని పోలీసులకు సమాచారం వచ్చింది. దీంతో పోలీసులు అరుల్ చిన్నప్పన్ ఇంటిపై దాడి చేసి రూ.4.8కోట్ల విలువైన పాత కరెన్సీనోట్లను స్వాధీనం చేసుకున్నారు.రద్దు అయిన 1000రూపాయల విలువగల కరెన్సీనోట్లు లభించాయని పోలీసులు చెప్పారు. అరుల్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు చెప్పారు.

Updated Date - 2021-04-13T12:50:15+05:30 IST