రాష్ట్రంలో రాక్షస పాలన

ABN , First Publish Date - 2021-08-01T05:16:19+05:30 IST

రాష్ట్రంలో రెండేళ్లుగా రాక్షసపాలన సాగుతోందని నియోజవర్గ టీడీపీ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి అన్నారు. శనివారం స్థానిక ప్రజాసదన్‌లో నియోజవర్గ సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో జగన్‌ అవలంబిస్తున్న ప్రజావ్యతిరేక విధానా లను ప్రజల్లోకి తీసుకు వెళ్లాలన్నారు. అధికార పార్టీ నాయకులు చేస్తున్న దోపిడీలపై తిరగబడేలా ప్రజలను చైతన్య పరచాలన్నారు.

రాష్ట్రంలో రాక్షస పాలన
మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి

మాజీ ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి 

నరసన్నపేట, జూలై 31: రాష్ట్రంలో రెండేళ్లుగా రాక్షసపాలన  సాగుతోందని నియోజవర్గ టీడీపీ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి అన్నారు. శనివారం స్థానిక ప్రజాసదన్‌లో నియోజవర్గ సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో సీఎం జగన్‌ అవలంబిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకు వెళ్లాలన్నారు. అధికార పార్టీ నాయకులు చేస్తున్న దోపిడీలపై తిరగబడేలా ప్రజలను చైతన్య పరచాలన్నారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించలేని స్థితిలో పాలకులు ఉండడం దురదృష్టకరమన్నారు. పెట్రోల్‌, డీజిల్‌పై వ్యాట్‌ పేరుతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దోచుకుంటున్నాయన్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే కేసులతో భయపెట్టాలని చూడడం దారుణమన్నారు. ఇటువంటి దాడులకు టీడీపీ భయపడేది లేదని అధికార పార్టీ పెద్దలు గుర్తించుకోవాలని కోరారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు శిమ్మ చంద్రశేఖర్‌, గొండు రామన్న, గొద్దు చిట్టిబాబు,  రోణంకి కృష్ణంనాయుడు, మైలపల్లి త్రినాథరావు తదితరులు పాల్గొన్నారు.  


3న ధర్నాకు తరలిరావాలి

నిత్యావసర ధరల పెరుగుదల, ప్రభుత్వ అవినీతికి వ్యతిరేకంగా నరసన్నపేటలో ఈనెల 3న నిర్వహించనున్న ధర్నాకు నాయకులు, కార్యకర్తలు తరలిరావాలని మాజీ ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి ఒక ప్రకటనలో కోరారు.

 

 

Updated Date - 2021-08-01T05:16:19+05:30 IST