అక్రమ కట్టడాలు కూల్చివేత
ABN , First Publish Date - 2021-09-15T02:34:46+05:30 IST
ప్రభుత్వ భూమిలో రిసార్టుల పేరుతో నిర్మించిన అక్రమ కట్టడాలను
వికారాబాద్: ప్రభుత్వ భూమిలో రిసార్టుల పేరుతో నిర్మించిన అక్రమ కట్టడాలను రెవెన్యూ అధికారులు కూల్చివేసారు. వికారాబాద్ మండలంలోని గోదంగూడలో అక్రమ కట్టడాలను అధికారులు ధ్వంసం చేసారు. సర్పన్పల్లి ప్రాజెక్ట్ దగ్గర సర్వేనంబర్ 97లోని ప్రభుత్వ భూమిలో రిసార్ట్స్ నిర్మాణం జరిగింది. అయితే రెవెన్యూ అధికారులు హెచ్చరించినా యాజమాన్యం పట్టించుకోలేదు. దీంతో నిర్మాణాలను అధికారులు కూల్చివేసారు. జిల్లాలోని ఓ అధికార పార్టీ ఎమ్మెల్యే అండదండలతోనే అక్రమ నిర్మాణం కొనసాగుతున్నట్లు స్థానికులు అనుమానిస్తున్నారు.