కాంగ్రెస్తోనే ప్రజాస్వామ్యం మనుగడ
ABN , First Publish Date - 2022-08-14T05:42:14+05:30 IST
దేశంలోను, రాష్ట్రంలోను ప్రజాస్వామ్యం మనుగడను సాధించాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని టీపీసీసీ కార్యదర్శి జి.మధుసూదన్రెడ్డి పిలుపునిచ్చారు.
- ఆజాదీ కా గౌరవ్ యాత్రలో టీపీసీసీ కార్యదర్శి జి.మధుసూదన్రెడ్డి
చిన్నచింతకుంట, ఆగస్టు 13 : దేశంలోను, రాష్ట్రంలోను ప్రజాస్వామ్యం మనుగడను సాధించాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని టీపీసీసీ కార్యదర్శి జి.మధుసూదన్రెడ్డి పిలుపునిచ్చారు. శనివారం మండలంలోని పర్దిపూర్, నెల్లికొం డ, దమజ్ఞాపూర్, చిన్నవడ్డెమాన్, పెద్దవడ్డెమాన్, ఏదులాపూర్, చిన్నచింతకుంట గ్రామాల్లో ఆజాదీకా గౌరవయాత్ర కార్యక్రమంలో భాగంగా ఆయన గ్రామాల్లో జాతీయ జెండాలతో పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో ప్రజలను, కార్యకర్తలను ఉద్ధేశించి ఆయన మాట్లాడారు. స్వాతంత్య్ర ఉద్యమం కోసం ఎంతోమంది కాంగ్రెస్ నాయ కులు అసువులు బాసారని, దేశంలో ఆర్ధిక సంస్కరణ తీసుకువచ్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనన్నారు. కార్యక్రమంలో టీపీసీసీ ఆర్గనైజింగ్ సెక్రటరీ కొండ ప్రశాంత్రెడ్డి, మైనార్టీ కార్యదర్శి సాదిక్, సిరాజ్ఖాద్రి, లక్ష్మీనారాయణ, రాఘవేందర్రెడ్డి, కొండ జగదీశ్వర్, నరసింహారెడ్డి, మండల కోఆప్షన్ మైముద్, శేఖర్, ప్రతాప్, శ్రీనివాస్గౌడ్ తదితరులున్నారు.