తాగునీటి సమస్య పరిష్కరించాలి
ABN , First Publish Date - 2022-05-25T06:05:18+05:30 IST
తాగునీటి సమస్య పరిష్కరించాలి
జంగారెడ్డిగూడెం, మే 24: నెల రోజులుగా తాగునీటి సమస్యతో ఇబ్బంది పడుతుంటే పట్టించుకోవడం లేదంటూ లోకేష్నగర్ ప్రాంత మహిళలంతా మంగళవారం ఖాళీ బిందెలతో 10వ వార్డు సచివాల యం వద్దకు వెళ్లారు. తాగునీటి సమస్యను పరిష్కరించాలని నిరసన తెలిపారు. తాగునీటి సమస్యపై పలుమార్లు సచివాలయ సిబ్బందికి చె ప్పినా పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వేసవిలో దూర ప్రాం తాల నుంచి బిందెలతో నీటిని తెచ్చుకోవడం కష్టంగా ఉందని, పనులు మానుకుని వేచి చూడాల్సి వస్తోందని తెలిపారు. అనంతరం సచివాల య అడ్మిన్ చిట్టిబాబుకు వినతిపత్రం అందజేశారు. మహిళలతో కౌన్సి లర్ కె.లావణ్య చర్చించారు. శాశ్వత పరిష్కారం చూపే వరకు ట్యాం కర్తో నీటిని సరఫరా చేస్తామని హామీ ఇచ్చారు. డాంగే నగర్ అంబే డ్కర్ యువజన సంఘం సభ్యుడు ఆసీఫ్, లక్ష్మణరావు ఉన్నారు.