విద్యుత్ సవరణ చట్టాన్ని రద్దు చేయాలని ధర్నా
ABN , First Publish Date - 2022-08-09T04:24:53+05:30 IST
కేంద్ర ప్రభుత్వం విద్యుత్ సవరణ చట్టం 2022 రద్దుచేయాలని తెలం గాణ స్టేట్పవర్ ఎంప్లాయీస్ జేఏసీ ఆధ్వర్యంలో సోమవా రం జిల్లాకేంద్రంలోని సర్కిల్కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు.
ఆసిఫాబాద్, ఆగస్టు 8: కేంద్ర ప్రభుత్వం విద్యుత్ సవరణ చట్టం 2022 రద్దుచేయాలని తెలం గాణ స్టేట్పవర్ ఎంప్లాయీస్ జేఏసీ ఆధ్వర్యంలో సోమవా రం జిల్లాకేంద్రంలోని సర్కిల్కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సంద ర్భంగా వారు మాట్లాడుతూ ఈ చట్టం ద్వారా విద్యుత్ రంగాన్ని ప్రైవేటు పరంచేసి బడాబాబులకు అప్పగించేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. ఈ చట్టం అమలైతే ఉద్యోగులకు, వినియోగదారులకు తీవ్రనష్టం జరుగుతుందన్నారు. జేఏసీ చైర్మన్ విలాస్, కన్వీనర్ వాసుదేవ్, కోకన్వీనర్లు ఏమాజీ, సతీష్ ఉద్యోగులు పాల్గొన్నారు.