పెట్రోల్ ధరలు తగ్గించాలని డిమాండ్
ABN , First Publish Date - 2021-06-15T04:57:11+05:30 IST
పెట్రోలు, డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలని ఉత్తరాంధ్ర అభి వృద్ధి ఐక్యవేదిక ప్రతినిధులు మద్దిల సోంబాబు, పృథ్వీ డిమాండ్ చేశారు. సోమవారం కోట జంక్షన్లో ప్లకార్డులతో రిక్షాపై నిరసన కార్యక్రమం చేపట్టారు.
దాసన్నపేట: పెట్రోలు, డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలని ఉత్తరాంధ్ర అభి వృద్ధి ఐక్యవేదిక ప్రతినిధులు మద్దిల సోంబాబు, పృథ్వీ డిమాండ్ చేశారు. సోమవారం కోట జంక్షన్లో ప్లకార్డులతో రిక్షాపై నిరసన కార్యక్రమం చేపట్టారు. వరుసగా పెట్రోల్, డీజిల్ ధరలు పెంచి కరోనా కష్టకాలంలో సామాన్యులపై భారం మోపడం తగదన్నారు. వేదిక ప్రతినిధులు వినోద్, రాజేష్, గీత, ప్రశాంత్, చక్రి, ఈశ్వర్, మోహన్ పాల్గొన్నారు.