Coronavirus: డెల్టా వేరియంట్ ముప్పు: రాష్ట్రాలు జినోమ్ సీక్వెన్సింగ్‌పై దృష్టి పెట్టాలన్ని కేంద్రం!

ABN , First Publish Date - 2021-07-12T14:10:41+05:30 IST

కరోనా వైరస్‌లోని డెల్టా వేరియంట్ వ్యాప్తి...

Coronavirus: డెల్టా వేరియంట్ ముప్పు: రాష్ట్రాలు జినోమ్ సీక్వెన్సింగ్‌పై దృష్టి పెట్టాలన్ని కేంద్రం!

న్యూఢిల్లీ: Coronavirus కరోనా వైరస్‌లోని డెల్టా వేరియంట్ వ్యాప్తి చెందుతున్న నేపధ్యంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు పలు సూచనలు చేసింది. జినోమ్ సీక్వెన్సింగ్ నిర్థారణ కోసం శాంపిల్స్ సేకరణను మరింతగా పెంచాలని ఆదేశించింది. తద్వారా కేంద్రం వీటిని ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేస్తుందని తెలిపింది. 


ఈ సందర్భంగా మీడియాతో కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి ఆరతి అహూజా మాట్లాడుతూ ఏప్రిల్, మే నెలలో దేశంలోని పలు జిల్లాలలో డెల్టా వేరియంట్ కేసులు వెలుగు చూశాయన్నారు. తాజాగా తాము రాష్ట్రాలకు రాసిన లేఖలో దేశంలో కరోనాకు సంబంధించిన ఇతర వేరియంట్లు కూడా వ్యాప్తి చెందే అవకాశాలున్నాయని వైద్యాధికారులంతా అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నామన్నారు. కాగా ఇటీవల కేంద్ర ప్రభుత్వం దేశంలోని వివిధ జిల్లాల్లోని 174 జిల్లాల్లో అల్ఫా, బీటా, గామా, డెల్టా వేరియంట్లు వ్యాప్తి చెందుతుండటం ఆందోళన కలిగిస్తున్నదని పేర్కొంది.

Updated Date - 2021-07-12T14:10:41+05:30 IST