8 మందికి డెల్టా వైరస్
ABN , First Publish Date - 2021-12-18T17:25:28+05:30 IST
కరోనా సోకిన 70 మంది రోగులకు జీనోమ సీక్వెన్సింగ్ పరీక్షలు చేయగా, 8 మందికి డెల్టా వేరియంట్ వైరస్ నిర్ధారణ అయిందని రాష్ట్ర ఆరోగ్య మంత్రి ఎం.సుబ్రహ్మణ్యం తెలిపారు. మరో 28 మందికి ఎస్ జీన్
- ఆరోగ్య మంత్రి సుబ్రమణ్యం వెల్లడి
అడయార్(చెన్నై): కరోనా సోకిన 70 మంది రోగులకు జీనోమ సీక్వెన్సింగ్ పరీక్షలు చేయగా, 8 మందికి డెల్టా వేరియంట్ వైరస్ నిర్ధారణ అయిందని రాష్ట్ర ఆరోగ్య మంత్రి ఎం.సుబ్రహ్మణ్యం తెలిపారు. మరో 28 మందికి ఎస్ జీన్ అనే వైరస్ లక్షణాలున్నట్టు తెలుస్తుందన్నారు. ఇదే అంశంపై ఆయన శుక్రవారం నగరంలో విలేకరులతో మాట్లాడుతూ, ఆర్టీపీరీఆర్ పరీక్షల్లో కరోనా సోకినట్టు తేలిన పక్షంలో వారిని తక్షణం ఆస్పత్రికి తరలిస్తున్నట్టు చెప్పారు. విదేశాల నుంచి వచ్చిన 70 మందికి పాజిటివ్ వచ్చిందన్నారు. వీరిలో ఐదుగురు కోలుకున్నారన్నారు. 28 మందికి ఒమై క్రాన్ లక్షణాలు ఉన్నాయన్నారు. అలాగే, 8 మందికి డెల్టా వైరస్ సోకిందన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఆక్సిజన్ సదుపాయంతో లక్షకు పైగా పడకలు ఉన్నాయని మంత్రి సుబ్రమణ్యం వివరించారు.