రాజ‌ధాలో అత్య‌ధిక ఉష్ణోగ్ర‌త‌లు న‌మోదు

ABN , First Publish Date - 2020-05-23T16:03:50+05:30 IST

దేశ రాజధాని ఢిల్లీ ఒక‌వైపు కరోనా వైరస్‌తో, మ‌రోవైపు అత్య‌ధిక ఎండ‌వేడిమితో పోరాడుతోంది. లాక్‌డౌన్‌ 4.0లో కొన్ని సడలింపులు ఉన్నప్పటికీ జ‌నం అత్య‌ధిక ఉష్ణోగ్ర‌త‌ల కార‌ణంగా అవ‌స్థ‌లు

రాజ‌ధాలో అత్య‌ధిక ఉష్ణోగ్ర‌త‌లు న‌మోదు

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ ఒక‌వైపు కరోనా వైరస్‌తో, మ‌రోవైపు అత్య‌ధిక ఎండ‌వేడిమితో పోరాడుతోంది. లాక్‌డౌన్‌ 4.0లో కొన్ని సడలింపులు ఉన్నప్పటికీ జ‌నం అత్య‌ధిక ఉష్ణోగ్ర‌త‌ల కార‌ణంగా అవ‌స్థ‌లు ప‌డుతున్నారు. రాజ‌ధానిలో ప్ర‌స్తుతం 45 డిగ్రీల సెల్సియస్  ఉష్ణోగ్రత‌లు దాటాయి.‌ అదే విధంగా రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, బీహార్ ఢిల్లీల‌లో వేడి గాలులు వీస్తున్నాయి. వాతావరణశాఖ అధికారులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం వచ్చేవారంలో కూడా ఇదే స్థాయి ఉష్ణోగ్ర‌త‌లు కొన‌సాగే అవ‌కాశాలున్నాయి. అమ్ఫాన్ తుఫాను తరువాత ఉత్తర, మధ్య భారతంలో ఉష్ణోగ్రతలు పెరిగాయి. ఉత్తరప్రదేశ్, రాజస్థాన్‌లలో సోమవారం వరకు వేడి గాలులు వీస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. మధ్యప్రదేశ్, విదర్భ, తెలంగాణలో ఆదివారం వరకు ఇటువంటి పరిస్థితులు కొన‌సాగ‌నున్నాయి. దక్షిణ భారతదేశంలోని అనేక రాష్ట్రాల్లో తేలికపాటి నుండి ఓ మోస్త‌రు వర్షం పడే అవకాశం ఉంది. 

Updated Date - 2020-05-23T16:03:50+05:30 IST