ఉక్రెయిన్ నుంచి ఢిల్లీ చేరుకున్న తెలుగు విద్యార్థులు

ABN , First Publish Date - 2022-03-03T16:06:53+05:30 IST

ఉక్రెయిన్ - రష్యా మధ్య యుద్ధం కొనసాగుతోంది. యుద్ధం నేపథ్యంలో ఉక్రెయిన్‌లో చిక్కుకున్న తెలుగు విద్యార్థులను రక్షించి.. స్వదేశానికి రప్పించేందుకు భారత ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోంది.

ఉక్రెయిన్ నుంచి ఢిల్లీ చేరుకున్న తెలుగు విద్యార్థులు

న్యూఢిల్లీ: ఉక్రెయిన్ - రష్యా మధ్య యుద్ధం కొనసాగుతోంది. యుద్ధం నేపథ్యంలో ఉక్రెయిన్‌లో చిక్కుకున్న తెలుగు విద్యార్థులను రక్షించి.. స్వదేశానికి రప్పించేందుకు భారత ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే చాలా మంది విద్యార్థులు ఇండియాకు చేరుకున్నారు. తాజాగా మరికొంత మంది తెలంగాణ, ఏపీకి చెందిన విద్యార్థులు ఉక్రెయిన్ నుంచి ఢిల్లీ చేరుకున్నారు. ఏపీ భవన్‌లో ఆంధ్రప్రదేశ్ విద్యార్థుల యోగక్షేమాలను టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్  అడిగి తెలుసుకున్నారు.  అనంతరం ఎంపీ మీడియాతో మాట్లాడుతూ... ఉక్రెయిన్ విద్యార్థులను కలిసి వారికి  ఎదురైన ఇబ్బందులను తెలుసుకున్నామన్నారు. ఖర్వివ్‌లో విద్యార్థులు ఇబ్బందులు ఎదురుకుంటున్నారని తెలిపారు. విదేశాంగ శాఖ సెక్రటరీకి టీడీపీ సెల్ ద్వారా సేకరించిన విద్యార్థుల లిస్ట్‌ను అందించామన్నారు. చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఢిల్లీలో ఉండి పని చేస్తున్నామని చెప్పారు. టీడీపీ ఎన్ఆర్ఐ సెల్ ద్వారా కూడా విద్యార్థుల సహాయం అందింస్తున్నామని ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ పేర్కొన్నారు. 


Updated Date - 2022-03-03T16:06:53+05:30 IST