బీజేపీలో విలీనంకానున్న యువ తెలంగాణ పార్టీ
ABN , First Publish Date - 2022-02-16T13:42:22+05:30 IST
బీజేపీలోకి యువ తెలంగాణ పార్టీ విలీనానికి సర్వం సిద్ధమైంది.
న్యూఢిల్లీ: బీజేపీలోకి యువ తెలంగాణ పార్టీ విలీనానికి సర్వం సిద్ధమైంది. బుధవారం ఉదయం 10 గంటలకు ఢిల్లీ వేదికగా బీజేపీలోకి యువ తెలంగాణ పార్టీ విలీనం కానుంది. జాతీయ నేతలు, బండి సంజయ్ సమక్షంలో జిట్టా బాలకృష్ణారెడ్డి, రాణి రుద్రమ, తదితరులు కషాయ కండువా కప్పుకోనున్నారు. ఇప్పటికే యువ తెలంగాణ రాష్ట్ర కమిటీ, జిల్లాల అధ్యక్షులు ఢిల్లీ చేరుకున్నారు. ఢిల్లీ నుంచి వచ్చాక హైదరాబాద్లో భారీ ర్యాలీ, బహిరంగ సభకు జిట్టా బాలకృష్ణారెడ్డి ప్రణాళిక రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది.