Shocking: తనతో ఛాటింగ్ చేయడం లేదని యువకుడి దారుణం.. స్నేహితులతో కలిసి బాలికపై కాల్పులు.. చివరకు..

ABN , First Publish Date - 2022-08-27T21:25:37+05:30 IST

సోషల్ మీడియా పరిచయాలు ఏన్నో నేరాలకు కారణమవుతున్నాయి.

Shocking: తనతో ఛాటింగ్ చేయడం లేదని యువకుడి దారుణం.. స్నేహితులతో కలిసి బాలికపై కాల్పులు.. చివరకు..

సోషల్ మీడియా పరిచయాలు ఏన్నో నేరాలకు కారణమవుతున్నాయి. మొక్కూ మొహం తెలియని వ్యక్తులతో స్నేహం చేసి కొందరమ్మాయిలు తమ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. తాజాగా దేశ రాజధాని ఢిల్లీ (Delhi)లో ఇలాంటి ఘటనే జరిగింది.. ఇంటర్మీడియెట్ చదువుతున్న 16 ఏళ్ల బాలికకు రెండేళ్ల క్రితం సోషల్ మీడియా ద్వారా అర్మాన్ అలీ అనే యువకుడు పరిచయమయ్యాడు. ఇద్దరూ సోషల్ మీడియా ద్వారా ఛాటింగ్ చేసుకునేవారు. ఏమైందో ఏమో కొన్ని రోజులుగా అలీని ఆ బాలిక అవాయిడ్ చేయడం ప్రారంభించింది. 


ఇది కూడా చదవండి..

Fake IT Raids: వ్యాపారి ఇంట్లో నకిలీ ఐటీ దాడులు.. భారీ సొమ్ము లూటీ.. ఈ స్కెచ్ వెనుక ఉన్నది ఎవరో తెలిస్తే..


అలీ నుంచి వచ్చిన మెసేజ్‌లకు రిప్లైలు ఇచ్చేది కాదు. దీంతో ఆ బాలికపై అలీ కోపం తెచ్చుకున్నాడు. ఆ కోపంలో కంట్రోల్ తప్పాడు. బాబీ, పవన్ అనే ఇద్దరు మిత్రులతో కలసి బాలికపై దాడిచేయడానికి ప్లాన్ వేశాడు. గురువారం ఆ బాలిక పాఠశాల నుంచి ఇంటికి వస్తున్న సమయంలో కాల్పులు జరిపాడు. బాలికపై పలుమార్లు కాల్పులు జరిపి ముగ్గురూ అక్కడి నుంచి పారిపోయారు. 


రక్తపు మడుగులో పడి ఉన్న బాలికను స్థానికులు  వెంటనే దగ్గరలోని ఆస్పత్రికి తరలించారు. సకలంలో వైద్యం అందడంతో ఆమెకు ప్రాణాపాయం తప్పింది. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Updated Date - 2022-08-27T21:25:37+05:30 IST