ఢిల్లీలో 2,683 కోవిడ్ కేసులు నమోదు, 27 మంది మృతి

ABN , First Publish Date - 2022-02-02T02:19:31+05:30 IST

ఢిల్లీలో 2,683 కోవిడ్ కేసులు నమోదు, 27 మంది మృతి

ఢిల్లీలో 2,683 కోవిడ్ కేసులు నమోదు, 27 మంది మృతి

న్యూఢిల్లీ: దేశ రాజధాని న్యూఢిల్లీలో కోవిడ్ పాజిటివ్ కేసులు భారీ స్థాయిలో పెరుగుతున్నాయి. మంగళవారం రోజు కొత్తగా న్యూఢిల్లీలో 2,683 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదైనట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. కరోనా వల్ల మంగళవారం 27 మంది చనిపోయారని వైద్య అధికారులు పేర్కొన్నారు. కోవిడ్ పాజిటివ్ రేటు 5.09శాతానికి పడిపోయినట్లు అధికారులు చెప్పారు. సోమవారం రోజు ఢిల్లీలో 2,779 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదవగా, కోవిడ్ వల్ల 38 మంది మృతి చెందారు. 12,312 మంది కోవిడ్-19 రోగులు హోంక్వారంటైన్ లో ఉన్నట్లు వైద్య అధికారులు తెలిపారు. 1,390 మంది రోగులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. 154 మంది కోవిడ్ కేర్ కేంద్రాల్లో చికిత్స తీసుకుంటుండగా, 9 మంది రోగులు కోవిడ్ హెల్త్ కేంద్రాల్లో చికిత్స పొందుతున్నారని వైద్య అధికారులు తెలిపారు.

Updated Date - 2022-02-02T02:19:31+05:30 IST