ఢిల్లీలో 24 శాతానికి పడిపోయిన కోవిడ్ పాజిటివిటీ రేటు

ABN , First Publish Date - 2021-05-06T22:14:37+05:30 IST

ఢిల్లీలో 24 శాతానికి పడిపోయిన కోవిడ్ పాజిటివిటీ రేటు

ఢిల్లీలో 24 శాతానికి పడిపోయిన కోవిడ్ పాజిటివిటీ రేటు

న్యూఢిల్లీ: కరోనా వైరస్ ఢిల్లీలో విలయతాండవం చేస్తోంది. రాష్ట్రంలో రోజువారీగా భారీ సంఖ్యలో కోవిడ్ కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీలో గురువారం కొత్తగా 19,133 కరోనా వైరస్ కేసులు నమోదవగా, కోవిడ్ వల్ల 335 మంది మృతి చెందినట్లు ప్రభుత్వం పేర్కొంది. మొత్తం 12,73,035 కోవిడ్ కేసులు నమోదవగా, కోవిడ్ వల్ల 18,398 మంది మరణించినట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. అంతే కాకుండా నేషనల్ క్యాపిటల్ యొక్క పాజిటివిటీ రేటు సోమవారం 30 శాతం నుంచి 24.29శాతానికి పడిపోయిందని, మంగళవారం, బుధవారం వరుసగా 27శాతం నుంచి 26 శాతానికి పడిపోయిందని ఆరోగ్య శాఖ వెల్లడించింది.

Updated Date - 2021-05-06T22:14:37+05:30 IST