రాజధానిలో కొత్తగా 1,984 కరోనా కేసులు... నెల్లాళ్లలో అత్యల్పం!

ABN , First Publish Date - 2020-09-29T15:00:12+05:30 IST

దేశరాజధాని ఢిల్లీలో గడచిన 24 గంటల్లో కొత్తగా 1,984 కరోనా కేసులు నమోదయ్యాయి. నెల్లాళ్ల వ్యవధిలో ఇంత తక్కువ సంఖ్యలో కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి.

రాజధానిలో కొత్తగా 1,984 కరోనా కేసులు... నెల్లాళ్లలో అత్యల్పం!

న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీలో గడచిన 24 గంటల్లో కొత్తగా 1,984 కరోనా కేసులు నమోదయ్యాయి. నెల్లాళ్ల వ్యవధిలో ఇంత తక్కువ సంఖ్యలో కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. తాజాగా నమోదైన కేసులతో ఢిల్లీలో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 2.73 లక్షలకు చేరుకుంది. మొత్తం మృతుల సంఖ్య 5,272కు చేరుకుంది. 



ఢిల్లీలో సెప్టెంబరు ఒకటి నుంచి ప్రతీరోజూ రెండు వేలకుపైగా కరోనా కేసులు నమోదవుతూ వస్తున్నాయి. సెప్టెంబరు 16న 4,473 కేసులు నమోదయ్యాయి. ఇదే ఇప్పటివరకూ ఒక్క రోజులో నమోదైన అత్యధిక కేసులు. ఢిల్లీ వైద్యఆరోగ్యశాఖ తాజాగా తెలిపిన వివరాల ప్రకారం కరోనా కారణంగా కొత్తగా 27 మంది మృతి చెందారు. దీంతో ఢిల్లీలో మొత్తం మృతుల సంఖ్య 5,272కు చేరుకుంది. కాగా ఢిల్లీ ప్రభుత్వం ఇటీవలికాలంలో కరోనా టెస్టుల సంఖ్యను మరింతగా పెంచింది. 

Updated Date - 2020-09-29T15:00:12+05:30 IST