విషమంగానే ఢిల్లీ బాలిక ఆరోగ్యం
ABN , First Publish Date - 2020-08-08T08:32:43+05:30 IST
దేశ రాజధాని ఢిల్లీలో దారుణ అత్యాచారం, దాడికి గురైన బాలిక (12) పరిస్థితి ఇంకా విషమంగానే ఉంది. తలకు తీవ్ర గా యాలైన బాలిక.. ఎయిమ్స్లోని న్యూరో సర్జరీ ఐసీయూలో చికిత్స పొందుతోంది...
న్యూఢిల్లీ, ఆగస్టు 7: దేశ రాజధాని ఢిల్లీలో దారుణ అత్యాచారం, దాడికి గురైన బాలిక (12) పరిస్థితి ఇంకా విషమంగానే ఉంది. తలకు తీవ్ర గా యాలైన బాలిక.. ఎయిమ్స్లోని న్యూరో సర్జరీ ఐసీయూలో చికిత్స పొందుతోంది. ఆమెకు మరో శస్త్రచికిత్స అవసరమని వైద్యులు తెలిపారు. అయితే, రక్తంలో ప్లేట్లెట్ల సంఖ్య మరీ తక్కువగా ఉందని పేర్కొన్నారు. పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నామని వివరించారు. ఆమె పేగులు, పురీష నాళం తీవ్రంగా దెబ్బతిన్నాయని సీనియర్ వైద్యుడు ఒకరు తెలిపారు. కాగా, బాలిక ఇంట్లోకి చొరబడి ఆమెపై అఘాయిత్యానికి యత్నించిన నిందితుడు క్రిషన్ను పోలీసులు అరెస్టు చేశారు. దొంగతనం చేసే ఉద్దేశంతోటే తాను బాలిక ఇంట్లోకి ప్రవేశించినట్లు అతడు చెప్పారు. ఈ క్రమంలో ఆమె అరిచిందని.. దీంతో కుట్టు మిషన్ పరికరాన్ని తనపైకి విసిరేశానని క్రిషన్ పోలీసుల వి చారణలో తెలిపాడు. అప్పటికీకత్తెరతో పలుసార్లు పొడిచినట్లు వివరించాడు.