కరోనా కారణంగా నేర దర్యాప్తు తీరే మారిపోయింది: ఢిల్లీ పోలీసులు

ABN , First Publish Date - 2020-08-10T05:21:34+05:30 IST

కరోనా కారణంగా నేర దర్యాప్తులో అనేక సమూల మార్పులు వచ్చాయని ఢిల్లీ పోలీసులు చెబుతున్నారు.

కరోనా కారణంగా నేర దర్యాప్తు తీరే మారిపోయింది: ఢిల్లీ పోలీసులు

న్యూఢిల్లీ: కరోనా కారణంగా నేర దర్యాప్తులో సమూల మార్పులు వచ్చాయని ఢిల్లీ పోలీసులు చెబుతున్నారు. కేసుల దర్యాప్తు సమయంలో.. తాము కరోనా పాలపడకుండా ఉండేందుకు అనేక జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తోందంటున్నారు. పీపీఈ కిట్లు ధరించడం, ఫింగర్ ప్రింట్ల సేకరణలో అత్యంత అప్రమత్తంగా వ్యవహరించడం నిత్యకృత్యమైపోయిందని వారు తెలిపారు. శానిటైజర్ ద్వారా చేతులు శుభ్రపరుకచుకోవడం కూడా ఇప్పడు తమ వృత్తి జీవితంలో ఓ ముఖ్యమైన భాగమని వారు వ్యాఖ్యానిస్తున్నారు. ఇక టెక్నాలజీ ప్రాముఖ్యం కూడా ఎన్నడూ లేనంతగా పెరిగిందని, సమన్లు, వారంట్లను ప్రస్తుతం వాట్సాప్ ద్వారా జారీ చేస్తున్నామని తెలిపారు. సమావేశాలూ కూడా వీడియో లింక్ ద్వారానే జరుగుతున్నాయన్నారు.  

Updated Date - 2020-08-10T05:21:34+05:30 IST