జిమ్ యజమానిని కాల్చి చంపిన పోలీసు కానిస్టేబుల్
ABN , First Publish Date - 2020-08-20T18:18:40+05:30 IST
ఓ పోలీసు కానిస్టేబుల్ జిమ్ యజమానిని కాల్చి చంపిన ఉదంతం...
న్యూఢిల్లీ : ఓ పోలీసు కానిస్టేబుల్ జిమ్ యజమానిని కాల్చి చంపిన ఉదంతం ఢిల్లీలోని రిథాలా ప్రాంతంలో గురువారం జరిగింది. షహబాద్ డెయిరీ పోలీసుస్టేషనులో సురేంద్ర (47) పోలీసు కానిస్టేబుల్ గా పనిచేస్తున్నారు. ద్వారకా ప్రాంతంలో జిమ్ నడిపే దీపక్ అనే వ్యక్తిని సురేంద్ర కాల్చి చంపాడు. జిమ్ యజమానిని పోలీసుకానిస్టేబుల్ ఎందుకు కాల్చి చంపాడో తెలియలేదు. పోలీసులు కానిస్టేబుల్ సురేంద్రను అరెస్టు చేసి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.