బోయిస్ లాకర్ రూం ఇన్‌స్టాగ్రామ్ గ్రూప్ అడ్మిన్ అరెస్ట్

ABN , First Publish Date - 2020-05-07T11:26:54+05:30 IST

పాఠశాల విద్యార్థులతో బోయిస్ లాకర్ రూం పేరిట ఇన్‌స్టాగ్రామ్ గ్రూప్ ఏర్పాటు చేసి అశ్లీల, మార్ఫ్‌డ్ ఫొటోలు పోస్టు చేసి అసభ్యంగా ఛాటింగ్ చేసిన కేసులో ప్రధాన నిందితుడైన గ్రూప్ అడ్మిన్ ను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు....

బోయిస్ లాకర్ రూం ఇన్‌స్టాగ్రామ్ గ్రూప్ అడ్మిన్ అరెస్ట్

న్యూఢిల్లీ : పాఠశాల విద్యార్థులతో బోయిస్ లాకర్ రూం పేరిట ఇన్‌స్టాగ్రామ్ గ్రూప్ ఏర్పాటు చేసి అశ్లీల, మార్ఫ్‌డ్ ఫొటోలు పోస్టు చేసి అసభ్యంగా ఛాటింగ్ చేసిన కేసులో ప్రధాన నిందితుడైన గ్రూప్ అడ్మిన్ ను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఏడాది 12 వతరగతి బోర్డు పరీక్షలు రాసిన గ్రూప్ అడ్మిన్ మేజర్ కావడంతో అతన్ని అరెస్టు చేశామని పోలీసులు చెప్పారు. ఈ గ్రూపులో 27 మంది విద్యార్థులు ఉన్నారని తేలడంతో పోలీసులు 15 మందిని ఇప్పటికే ప్రశ్నించారు. బోయిస్ లాకర్ రూం గ్రూప్ సభ్యుల మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకొని వాటిని ఫోరెన్సిక్ పరీక్ష కోసం ల్యాబ్ కు పంపించారు. పాఠశాల విద్యార్థుల గ్రూపుతోపాటు కళాశాల విద్యార్థుల కోసం ఇదే తరహాలో మరో గ్రూపు కూడా ప్రారంభించారని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. ఢిల్లీ సైబర్ సెల్ ప్రత్యేక విభాగం ఐటీ యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు సాగిస్తోంది. 

Updated Date - 2020-05-07T11:26:54+05:30 IST