మోసపోయిన ఢిల్లీ పోలీస్‌

ABN , First Publish Date - 2022-05-24T06:15:48+05:30 IST

న్యూఢిల్లీలో సీఐ ఎస్‌ఎఫ్‌ హెడ్‌ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న గోపాలపురం గ్రామానికి చెందిన కె.చంద్రరావును అదే గ్రామానికి చెం దిన కాకులపాటి శ్రీను రూ.5.74 లక్షలకు మోసం చేసినట్టు స్పందనకు ఫిర్యాదు వచ్చినట్టు ఎస్పీ ఐశ్వర్యరస్తోగి తెలిపారు.

మోసపోయిన ఢిల్లీ పోలీస్‌

స్పందనలో ఫిర్యాదు
రాజమహేంద్రవరం, మే 23 (ఆంధ్రజ్యోతి): న్యూఢిల్లీలో  సీఐ ఎస్‌ఎఫ్‌ హెడ్‌ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న గోపాలపురం గ్రామానికి చెందిన కె.చంద్రరావును  అదే  గ్రామానికి చెం దిన కాకులపాటి శ్రీను రూ.5.74 లక్షలకు మోసం చేసినట్టు స్పందనకు ఫిర్యాదు వచ్చినట్టు ఎస్పీ ఐశ్వర్యరస్తోగి తెలిపారు. జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన స్పందనకు హెడ్‌కానిస్టేబుల్‌ చంద్రరావు వచ్చి, భూమి విక్రయానికి సంబంధించి శ్రీను రూ.5.74 లక్షలు ఆన్‌లైన్‌ ట్రాన్స్‌ఫర్‌ చేయించుకుని మోసం చేశాడన్నారు. తిరిగి డబ్బులు ఇవ్వమంటే బెదిరిస్తున్నారని తెలిపారు.  ఎస్పీకి స్పందనలో ఫిర్యాదు చేశారు.  స్పందనలో మొత్తం 28 మంది ఎస్పీ రస్తోగికి అర్జీలు అందించారు.

Updated Date - 2022-05-24T06:15:48+05:30 IST