ఢిల్లీలో ఇదీ సీన్! లాక్‌డౌన్ ప్రకటన వెలువడిన కొద్ది నిమిషాలకే...

ABN , First Publish Date - 2021-04-19T21:28:58+05:30 IST

దేశరాజధానిలో మరోసారి లాక్డౌన్ విధించనుండడంతో నగర వీధుల్లో గతేడాది లాక్‌డౌన్ నాటి దృశ్యాలు దర్శనమిస్తున్నాయి.

ఢిల్లీలో ఇదీ సీన్! లాక్‌డౌన్ ప్రకటన వెలువడిన కొద్ది నిమిషాలకే...

న్యూఢిల్లీ: దేశరాజధానిలో మరోసారి లాక్‌డౌన్ విధించనుండడంతో నగర వీధుల్లో గతేడాది లాక్‌డౌన్ నాటి దృశ్యాలు దర్శనమిస్తున్నాయి. ఈ నిర్ణయాన్ని సీఎం కేజ్రీవాల్ ప్రకటించిన అరగంటకే ప్రజలు వైన్ షాపుల ముందు పెద్ద పెద్ద క్యూలు కట్టడం ప్రారంభించారు. గోలే మార్కెట్ ఏరియా, ఖాన్ మార్కెట్ల ప్రాంతాల్లో వైన్ షాపుల ముందు భారీ క్యూలల్లో ప్రజలు నిలబడి ఉన్న దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఓవైపు సెకండ్ వేవ్ కొనసాగుతున్నా కూడా ప్రజలు కొవిడ్ నిబంధనలు తుంగలో తొక్కి మద్యం కోసం బారులు తీరారు. కరోనా గొలుసుకట్టు వ్యాప్తిని నిరోధించేందుకు సీఎం కేజ్రీవాల్ లాక్ డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే. రాజధానిలో ఈ రోజు రాత్రి 10 గంటలకు అమల్లోకి రానున్న లాక్ డౌన్ ఏప్రిల్ 26 ఉదయం 5 గంటల వరకూ కొనసాగుతుంది.



Updated Date - 2021-04-19T21:28:58+05:30 IST